బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి పై తన మనసులో మాట చెప్పిన కిషన్ రెడ్డి

by Mahesh |   ( Updated:2023-11-08 14:59:53.0  )
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి పై తన మనసులో మాట చెప్పిన కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన్ను యాంకర్ ఇలా ప్రశ్నించారు. కిషన్ రెడ్డి త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిలో ఉండబోతున్నాడా.. అని అడిగ్గా.. కిషన్ రెడ్డి తన మనసులో అలాంటి ఆలోచన ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తాను బీజేపీ కార్యలయంలో ఓ సాధారణ కార్యకర్తగా ఉండి చదువుకున్నానని.. ఎల్లప్పుడు కష్టపడి పని చేసేవాడినని.. పార్టీ గుర్తించి నేడు తనని ఈ స్థాయిలో ఉంచిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే తాను అంబర్ పేట ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అన్ని ప్రణాళికలు పూర్తి చేసుకున్నానని.. పార్టీ నిర్ణయానికి తలొగ్గి తాను పోటీ నుంచి విరమించుకున్నట్లు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Also Read..

బీజేపీ కి బిగ్ షాక్...

Advertisement

Next Story

Most Viewed